దేశంలోనే తొలి లోక్పాల్గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. లోక్పాల్ను ఏర్పాటుచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్ ఘోష్ను లోక్పాల్ చీఫ్గా ఎంపిక చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పాల్గొన్నారు.