జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ చేరారు. దేశ రాజకీయాల్లో కొత్త ఒరవడి స్పష్టిస్తున్న జనసేన విధివిధానాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ప్రకటించారు. జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన నేటి యువతరానికి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భావానికంటే ముందు నుంచే లక్ష్మీనారాయణతో మాట్లాడానని అప్పడే కలిసి పని చేద్దామని భావించినా కొన్ని కారణాల వల్ల కుదరలేదని 2014లో అనుకున్నది 2019లో సాధ్యమైందన్నారు పవన్ కళ్యాణ్.