దారుణ హత్యకు గురైన తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి జగన్ నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి పులివెందుల చేరుకున్న జగన్ నేరుగా వైఎస్ వివేకా ఇంటికి చేరుకుని భౌతికకాయానికి మొదట నివాళులర్పించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను బంధువులను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఉన్నారు. భౌతికకాయన్ని సందర్శించిన విజయమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.