తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న కొద్ది ఇంకా వలసల బాట పడుతునే ఉన్నారు. కాగా ఈ నేపథ్యంలో బెల్లంపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుత లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరాలని అమురాజుల శ్రీదేవికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు అందినట్లు సమాచారం. దీంతో శ్రీదేవి కాంగ్రెస్లో చేరడానికి సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. కాగా రెండు మూడు రోజుల్లో తన అనుచరులతో కలిసి శ్రీదేవి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సంసిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
శ్రీదేవి టీడీపీ పక్షాన ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా భారీ మోజరీటితో గెలిచారు. ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చేరి పని సేలందరించారు. ప్రస్తుతం శ్రీదేవి మరోమారు కాంగ్రెస్ గూటికి చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు ప్రకటించాయి. మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కే.సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరుతునట్లు సమాచారం.