నేడు క్యాబినెట్ తొలి సమావేశం..

Update: 2019-05-31 01:33 GMT

కేంద్రంలో కొలువుదీరిన మోడీ కొత్త ప్రభుత్వం ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. సాయంత్రం 5గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్‌ జరగనుంది. 58మంది కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. భద్రత, పార్లమెంటరీ వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన క్యాబినెట్ కమిటీల ఏర్పాటుపైనా ప్రధాని నరేంద్ర మోడీ రాబోవు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం కేంద్ర మంత్రివర్గ సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Similar News