టీడీపీకి రాజీనామా చేసిన కీలక నేత..

Update: 2019-03-12 10:38 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జిల్లాలో అధికార పార్టీ టీడీపీకి భారీ షాక్ తగిలింది. అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కేవలం సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై తీవ్ర అసహనం, రాయదుర్గం టికెట్ ను మరోసారి కాలవ శ్రీనివాస్‌కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తితో టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గోవిందరెడ్డిని బుజ్జగించే పనిలో పడ్డారు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. అయితే గోవిందరెడ్డితో కాల్వ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చర్చలు విఫలమయ్యాయి. మొత్తానికి సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం పెట్టి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. 

Similar News