ఆమ్ ఆద్మీ నేత, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ మోతీనగర్ రోడ్షోలో పాల్గొన్న కేజ్రీవాల్పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. రోడ్ షోలో మాట్లాడుతున్న కేజ్రీవాల్ వాహనంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చి చెంప చెల్లుమనిపించాడు. దీంతో కేజ్రీవాల్తో పాటు అక్కడి వారంతా ఒక్కక్షణం బిత్తరపోయారు. వెంటనే స్పందించిన ఆప్ కార్యకర్తలు యువకున్ని పట్టుకోని పోలీసులకు అప్పగించారు.కాగా గతంలోనూ కేజ్రీవాల్పై అనేక సందర్భాల్లో దాడులు జరిగాయి. ఒక్కసారి చెప్పులతో దాడి చేయగా, ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసిన పథకం నచ్చక గతంలో కేజ్రీవాల్పై ఓ యువతి సిరా పోసిన విషయం తెలిసిందే, ఇప్పటి వరకు అరవింద్ కేజ్రీవాల్పై ఎనిమిది సార్లు దాడి జరిగింది.