పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పాదాబివందనం చేశారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో 'శౌర్య సమ్మాన్ సమరోహ్' పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో అమర జవాన్ల తల్లులను మంత్రి ఘనంగా సన్మానించారు. వారిని శాలువతో సత్కరించిన అనంతరం పాదాలకు నమస్కరించి వారిపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అమర జవాన్ల తల్లులకు రక్షణ మంత్రి ఇచ్చిన గౌరవం గురించి నెటిజన్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.