జగన్‌, కేసీఆర్, ప్రధాని మోడీలే టార్గెట్‌గా..

Update: 2019-04-02 10:56 GMT

జగన్‌, కేసీఆర్, ప్రధాని మోడీలే టార్గెట్‌గా సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన జగన్‌కు తెలిసింది నేరాలు, ఘోరాలు, కుట్రలేనంటూ విమర్శించారు. తనపై ఎలాంటి దాడులు జరిగినా ప్రజలే తనకు అండగా నిలవాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అల్లాడినప్పుడు కనబడని మోహన్‌బాబు, జయసుధ, అలీ లాంటి నటులు ఎన్నికల వేళ వలసపక్షుల్లా రాష్ట్రంపై వాలారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని దిల్లీ నుంచి గుజరాత్‌కు పంపే వరకు వదిలిపెట్టబోనన్నారు. వైసీపీకి ప్రధాని మోడీ, కేసీఆర్‌ నుంచి డబ్బు మూటలు అందుతున్నాయని ఆరోపించారు. జగన్‌కు ఓటేస్తే జైలుకు.. జనసేనకు ఓటేస్తే అత్తారింటికే పోతారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.   

Similar News