ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలు, బూత్ కన్వీనర్లు, సేవామిత్రలతో టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వచ్చే 17 రోజులు అత్యంత కీలకం అని ప్రచారానికి మరో 15 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉందని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించిన చంద్రబాబు రాజకీయ వైరాలు మరచి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. డేటా చోరి చేసి మరీ మనకే ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. నేరాలు, ఘోరాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని అభివృద్ధి, సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం అని చంద్రబాబు అన్నారు.