డేటా చోరీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే దీటుగా రియాక్టవుతోంది. ఐటీ గ్రిడ్స్ కంపెనీలో తెలంగాణ పోలీసుల సోదాలపై తీవ్రంగా స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అడుగు ముందుకేశారు. తెలంగాణ సిట్కు కౌంటర్గా ఏపీ నుంచి కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ డేటా చోరీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ దర్యాప్తు బృందంలో బాలసుబ్రమణ్యంతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులను, సాంకేతిక నిపుణులను నియమించారు.