గిద్దలూరు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Update: 2019-04-04 12:14 GMT

ప్రకాశం జిల్లా గిద్దలూరు సభలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తెలంగాణ నుంచి భద్రాచలం తీసుకుంటాం అని చెప్పారు. ఏపీపై కుట్రలు పన్నుతున్న కేసీఆర్ ను వదిలిపెట్టను అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ ఖర్చు పెడుతున్న డబ్బులు ఎక్కడివి అని, దానికి జగన్ జవాబు చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఏపీతో పెట్టుకుంటే ఖబర్దార్ అంటూ ప్రధాని మోడీని చంద్రబాబు హెచ్చరించారు. ఏపీకి ద్రోహం చేసిన మోదీని గెలవనిచ్చేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ కేసీఆర్‌ ఏనాడూ ఏపీ ప్రజల శ్రేయస్సును కోరుకోలేదు. పోలవరంపై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లాడు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌ ఎవరు? అని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్రాభివృద్ధి కోసం తాను యజ్ఞం చేస్తున్నాను. రాక్షసుల మాదిరిగా నా యజ్ఞాన్ని నాశనం చేస్తున్నారు అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

Similar News