ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఆయా పార్టీ నేతలు వలసల బాటలు పడుతున్నారు. కాగా వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. గత కొంత కాలంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో టీడీపీ ఎమ్మెల్యేలు,ఎంపీలు వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిందే కాగా తాజాగా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరికపై ముహుర్తం ఫిక్స్ అయింది. ఈనెల 8వ తేదీన వైయస్ జగన్ సమక్షంలో రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీలో చేరనున్నారని అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా చల్లా రామకృష్ణారెడ్డి రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ సభ్యత్వాన్ని వదులకుంటూ సీఎం చంద్రబాబుకి లేఖ కూడా పంపారు.