ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో ఎన్నికలు ముగిసిన తరువాత నారా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారని, ఆయన ప్రచారం వల్ల బీజేపీకి లాభమే కానీ అసలు నష్టమేమి లేదన్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఫెడరల్ ఫ్రంట్ గాని భారతీయజనతాపార్టీతో సరితూగే పరిస్ధితే లేదన్నారు. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 300 పైగా సీట్లు గెల్చుకుంటుందని దత్తాత్రేయ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఇటివల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్లో కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని తెలిపారు. కాగా లోక్సభ ఫలితాలు ఖచ్ఛితంగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు.