జూన్‌ 13 నుంచి ఆర్టీసి సమ్మె: ఏపీ ఆర్టీసి జెఏసి

Update: 2019-06-01 03:12 GMT

ముందు ప్రకటించినట్లుగా జూన్ 13నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. దూరప్రాంత సర్వీసులను పూర్తిగా నిలిపేస్తామని ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ 6వేల 300కోట్ల నష్టాల్లో ఉందని ఈ నష్టాలను ప్రభుత్వమే భరించాలని జేఏసీ నేతలు కోరారు. ఏళ్ల తరబడిగా పరిష్కారానికి నోచుకోని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం స్పందించాలని ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ జేఏసి నేతలు డిమాండ్ చేశారు. ఆర్టీసీ సిబ్బంది కుదింపుపై ఆర్టీసి యాజమాన్యం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. 

Similar News