ప్రతిపక్ష నేతగా జగన్ తన బాధ్యతను మరిచారన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. జగన్ కు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఏపీలో వైసీపీని ప్రజలెవరూ నమ్మడంలేదని 54లక్షల ఓట్లు గల్లంతయ్యాయని చెప్పిన వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే టీడీపీపై బురద జల్లుతున్నారని అన్నారు. ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో కేసీఆర్ అండతో టీడీపీ అనుకూల వ్యాపారులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.