ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా స్టీఫెన్ రవీంద్ర నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తెలంగాణలో హైదరాబాద్ రేంజ్ ఐజీగా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో అత్యంత సమర్థుడిగా స్టీఫెన్కు పేరుంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ కావడానికి మరో 15 రోజులు పట్టే సమయం ఉందని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై కేంద్రానికి లేఖ రాసిన తర్వాత పూర్తిస్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఉన్నతాధికారులు చెబుతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్గా పని చేయడంతో పాటు వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయనకు పేరుంది. రాయలసీమలో చాలా ఏళ్లు పని చేసిన ఆయనకు మావోయిజం, ఫ్యాక్షనిజాలను కట్టడి చేసిన అధికారిగా గుర్తింపు ఉంది.