ఈసీ రజత్‌ కుమార్‌ అధికార పక్షపాతి: దాసోజు శ్రవణ్‌

Update: 2019-05-09 01:32 GMT

తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ సీఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌పై ఉన్న అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాకు తెలియచేశారు. తెలంగాణ ఈసీ రజత్‌ కుమార్‌ అధికార పక్షానికి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని దాసోజు శ్రవణ్‌ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పాదర్శకంగా జరగడం లేదని, గూడు పుఠాణిలా మారాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేష్‌ను రద్దు చేయాలని దాసోజు శ్రవణ్‌ సునీల్‌ అరోరాను కోరారు.

Similar News