సంచలనం సృష్టిస్తున్న 'కెజిఎఫ్' ట్రైలర్

Update: 2018-11-10 10:27 GMT

కన్నడ సినిమాలను తెలుగు ప్రజలు ఆదరించడం చాలా తక్కవే అయితే తాజాగా విడుదలైన ఓ కన్నడ 'కెజియఫ్' మూవీ ట్ర్రైలర్ ఇప్పడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది. ఈసినిమాకు యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కింది. అయితే ట్రైలర్ లోని పాయింట్ మేకింగ్ స్టైల్ ఆసక్తిరెకేత్తించేలా ఉండటంతో ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నమని 'వారాహి చలన చిత్రం' అధినేత సాయి కొర్రపాటి వెల్లడించారు. 1960 నుండి 1980 కాల వ్యవధిలో జరిగిన కథతో ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ముంబయితో ముడిపడిన గోల్డ్ మైన్స్ మాఫియా నేపథ్యంలో సాగే కథ అని ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా అర్ధమవుతోంది. కథ గోల్డ్ మైన్స్ మాఫియా బానిసత్వాన్ని ముగించాలని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. రాకీ పాత్రను పోషించే యాష్, అతను పెరుగుతున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించాలని మరియు బానిసత్వాన్ని ముగించడానికి నిర్ణయించుకుంటాడు. డైలాగ్స్, కథనం, దర్శకత్వం మరియు నటీనటుల ప్రదర్శనలు చాలామంది అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ట్విట్టర్లో బ్లాక్ బస్టర్ అని పిలుస్తున్నారు మరియు ఆ చిత్రం విడుదలకి ఆత్రుతగా విక్షాకులు ఎదురు చూస్తున్నారు. చలన చిత్ర కథకు ధన్యవాదాలు తెలుపుతూ ఇతర ప్రాంతీయ సినిమా మరియు బాలీవుడ్ల నిర్మాతలు వివిధ భాషల్లోని సినిమాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ట్రైలర్ ప్రదర్శించిన తీరు కూడా విక్షకులను మంత్రముగ్ధులను చేసిందనే చేప్పవచ్చు. అయితే ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
 

Similar News