వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతూ యువతను ఆకట్టుకునే యువ హీరో శర్వానంద్, తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చేనెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా విడుదలకు ముందే శాటిలైట్ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరింది, డిజిటల్ హక్కులు, హిందీ డబ్బింగ్ రైట్స్ కలుపుకుని 12 కోట్లు పలికినట్టుగా నిర్మాతలు ప్రకటించారు. శర్వానంద్ కెరీర్లో ఇదే అత్యధికంగా ప్రీరిలీజ్ బిజినెస్ కావడం విశేషం.