ఉత్సాహంగా..రేస్‌

Update: 2018-11-18 06:52 GMT

అంతర్జాతీయ స్థాయిలో విజయవాడలో నిర్వహిస్తున్న F1 H2O బోట్ రేస్ పోటీలు చివరిరోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ జరిగే ఫైనల్ పోటీలు మూడు రౌండ్స్‌లో జరుగుతున్నాయి. మొదటి రౌండ్‌లో 18 టీమ్‌లు, రెండో రౌండ్‌లో 12 టీమ్‌లు, మూడో రౌండ్‌లో 6 టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ పోటీల్లో ఫైనల్ విజేతకు సీఎం చంద్రబాబు బహుమతి ప్రదానం చేస్తారు. ఇది ఫైనల్ రేస్ కావడంతో వీక్షించేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో పర్యాటక శాఖ తగిన ఏర్పాట్లు చేసింది.  నేడు ఫైనల్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే ఏడు పోటీలు పూర్తయిన తరువాత చాంపియన్స్‌ను ప్రకటిస్తారు. 

Similar News