ఎట్టకేలకు జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బాలరాజును సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు జనసేనని పవన్ తెలిపారు. తనదీ, నాదేండ్ల మనోహర్ది, బాలరాజుది ఒకటే భావస్వారూప్యతని పవన్ వ్యక్యనించారు. గిరిజనుల అభివృద్ధి కోసం బాలారాజు సేవలను, అనుభవాన్ని పార్టీలో వినియోగించుకుంటామని జనసేనాని వెల్లడించారు.