అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఆయన... రాష్ట్రంలో రెండు మూడు పార్టీలకు అభివృద్ధిని అడ్డుకోవడమే అలవాటుగా మారిందన్నారు. గత ఎన్నికల్లో తమకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్కల్యాణ్ ఇప్పుడు మోడీ ఎలా చెబితే అలా నడుచుకుంటున్నారని ఆరోపించారు. తాము బీజేపీతో విభేదించక ముందు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని టీఆర్ఎస్ నేతలు కూడా డిమాండ్ చేశారని చంద్రబాబు గుర్తుచేశారు. ఎప్పుడైతే టీడీపీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిందో అక్కడి నుంచి బీజేపీ నేతలు రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.