టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు నటించిన మూవీ భరత్ అనే నేను. మూవీలో సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు కొరటాల శివ. అందుకే సినిమా సూపర్ హిట్ అయింది. అయితే రిలీజ్కు ముందే తొలగించిన ప్రైవేట్ స్కూళ్ల సీన్ను... పెట్టాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇంతకీ భరత్ అనే నేను మూవీలోని ఆ సీన్ లో ఏముంది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలపై మహేశ్ ఏమన్నారు. ప్రైవేట్ టీచర్స్ ఫెడరేషన్ ఆ సీన్ ఎందుకు తిరిగి చేర్చాలని కోరుతోంది.
భరత్ అనే నేను...మహేశ్బాబు నటించిన ఈ మూవీ టాలీవుడ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2వందల కోట్లు కలెక్షన్లు సాధించి...నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దర్శకుడు కొరటాల శివ సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు సినిమాలో తీశారు. అయితే సినిమాలోని ప్రైవేట్ స్కూల్ యాజామాన్యాల వసూళ్ల పర్వం ఎలా ఉంటుందో...ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలా తాయిలాలు ఇవ్వాలని ట్రై చేస్తారో చూపించారు. లంచం ఇస్తామంటూ చెప్పబోయిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రతినిధి అయిన మంత్రి కొడుకుకు...చెంప చెళ్లు మనేలా వాయిస్తాడు. SPOT
ఈ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, తాయిలాలకు సంబంధించిన సీన్ మాత్రం....సినిమాలో పెట్టలేదు. మే 4వ తేదీన సీన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే...ఇప్పటి వరకు 13లక్షల మందికిపైగా చూశారు. ఇదే సీన్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో...విపరీతంగా హిట్స్ వస్తున్నాయ్. మంచి సీన్ను ఎందుకు తొలగించారో చెప్పాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు.
భరత్ అనే నేను మూవీలోని తొలగించిన ప్రైవేట్ స్కూళ్ల సీన్ను మళ్లీ పెట్టాలని ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతిని వాస్తవరూపంలో చూపించారని, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆరాచకత్వానికి సినిమాలోని సీన్ పరాకాష్ట అని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అలీ అంటున్నారు. ఒత్తిళ్లతో చిత్ర నిర్మాతలు సీన్ తీసేశారని...ఇది క్షమించరానిదంటున్నారు. భరత్ అను నేను మూవీలో తీసేసిన సీన్ లో ఏమాత్రం అశ్లీలం లేదంటున్నారు టీపీటీఎఫ్ ప్రతినిధులు. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు స్పందించి...సినిమాలో తిరిగి ఆ సీన్ ను చేర్చాలని కోరుతున్నారు.