ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Update: 2018-12-03 06:47 GMT

ఏపీలో పదో తరగతి పరీక్షా షెడ్యూల్‌ విడుదలైంది. మంత్రి గంటా శ్రీనివాసరావు షెడ్యూల్‌ను విడుదల చేశారు. మార్చ్‌ 18 నుంచి ఎప్రిల్‌ 2 వరకు జరగనున్న పరీక్షల కోసం 2 వేల 835 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6 లక్షల 10 వేల విద్యార్థుల వరకు పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఉదయం 9 గంటలా 30 నిముషాల నుంచి మధ్యాహ్నం 12 గంటలా 15 నిముషాల వరకు పరీక్ష జరుగుతుందని.. హాల్‌ టిక్కెట్ల్ ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవాలని తెలిపారు. సున్నితమైన కేంద్రాలను గుర్తించామన్న మంత్రి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 
 

Similar News