వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్ ద్వారా జగన్ సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టిన జగన్ ఇప్పటికే విశాఖ, విజయనగరం, తూర్పు గోదావరి, కర్నూల్, అనంతపురం, కడప జిల్లాల్లో ప్రచార పర్యటనలు జరిపారు. నేడు మరో మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెం, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని వేమూరులో జగన్ ప్రచారం చేయనున్నారు.