గృహ ప్రవేశానికి రావలసిందిగా జగన్ లేఖలు..

Update: 2019-02-10 04:18 GMT

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు మంగళగిరి సమీపంలోని తాడేపల్లిలో నూతన గృహ ప్రవేశం చేస్తున్నారని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే రోజు నూతన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభం ఉంటుందని సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, లోక్‌సభ సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలకు జగన్ తరుపున లేఖలు పంపారు. కాగా కొన్ని అనివార్య కారణాల వలన ఈ నెల 13న ప్రకాశం జిల్లాలో జరగాల్సిన సమర శంఖారావం కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు తెలిపారు. అయితే 11వ తేదీన అనంతపురం జిల్లా కేంద్రంలో సమర శంఖారావం యథావిధిగా జరుగుతుందని సుబ్బారెడ్డి చెప్పారు. 

Similar News