చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు
మాజీ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులిచ్చారు.
మాజీ ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఉండవల్లి గ్రామ వీఆర్వో వెళ్లారు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులిచ్చారు. కరకట్ట దగ్గర వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో.. తక్షణమే ఖాళీ చేయాలంటూ.. ఉండవల్లి వీఆర్వో ప్రసాద్.. నోటీసు ఇచ్చేందుకు చంద్రబాబు ఇంటికి వచ్చారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించి వచ్చారు. ఇప్పటికే 32 మందికి నోటీసులు ఇచ్చామని ఉండవల్లి వీఆర్వో వెల్లడించారు.