ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు (శుక్రవారం) తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం అలిపిరి నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రత్యేక హోదా భరోసా యాత్ర బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రత్యెక హోదా మీద ఏపీ ప్రజలకి హామీ ఇవ్వడంతో పాటు, ఏపీకి విభజన హామీలని అమలు చేస్తామని వాగ్దానాలు చేయడానికి రెడీ అయ్యాడు రాహుల్.
.