సంక్రాంతి వేడుకల్లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు..

Update: 2019-01-13 10:20 GMT

పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి వేడుకల సందర్భంగా జంగారెడ్డిగూడెం పీఎస్ పరిధిలో కోడిపందాలు నిర్వహించే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఎవరైనా కోడి పందాలు, గుండాట, పేకాటతో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కోడి పందాలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు పెట్టారు. కోడి కత్తులు తయారు చేసే ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని నుంచి 234 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు  

Similar News