విశాఖలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2019-07-09 04:18 GMT

విశాఖ జిల్లా పాడేరులో రోడ్డు ప్రమాదం జరిగింది. వంట్లమామిడి ఘాట్ రోడ్డు వద్ద ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా 37 మంది ప్రయాణీకులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాకినాడకు చెందిన కొంత మంది భక్తులు రాయగడ మజ్జి గౌరమ్మ ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పాడేరు నుంచి విశాఖ వచ్చే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారికి అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ‌కు చెందిన వారిగా గుర్తించారు. 

Tags:    

Similar News