కర్నూల్ జిల్లాలో పట్టాలు తప్పిన రైలు

Update: 2019-03-03 02:38 GMT

కర్నూల్ జిల్లాలో రైలు పట్టాలు తప్పింది. చిత్తూరు నుంచి కాచిగూడ వెళుతున్న వేంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. అప్రమత్తమైన సిబ్బంది రైలును వెంటనే నిలిపివేశారు. ప్రస్తుతం ఇంజనుకు మరమత్తులు జరుసుగుతునట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి 2:30 గంటలకు ఈ ఘటన జరిగినట్టు సమాచారం. సిబ్బంది ట్రాక్‌ పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. ఇటీవల అదే ప్రాంతంలో గూడ్స్‌ రైలు కూడా పట్టాలు తప్పడం గమనార్హం.

Similar News