ఏపీ నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయనున్న బిష్వ భూషన్ హరిచందన్ ఇవాళ తిరుమలకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి 10 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి హరిచందన్ బయలుదేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల నుంచి విజయవాడ వెళ్లనున్నారు. రేపు ఏపీ గవర్నర్గా బిష్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.