ప్రజావేదిక విషయంపై స్పందించిన కేశినేని నాని

Update: 2019-06-25 04:42 GMT

అక్రమ కట్టకడాల నిర్మూలనలో భాగంగా ప్రజా వేదికను కూల్చివేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా సీఎం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ప్రజావేదిక విషయంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫేస్ బుక్ ‌లో స్పందించారు. ప్రజావేదిక అక్రమమో, సక్రమమో పక్కన పెడితే, అది ప్రజాధనంతో నిర్మించిన వేదిక అన్నారు. ప్రజావేదికను తొలగించాలనుకుంటే, అక్రమ నిర్మాణాలన్ని తొలగించిన తర్వాత, చివర్లో దానాని తొలగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజావేదికను తొలగిస్తే రాష్ట్ర ఖజానాకు రెండు విధాలా నష్టమన్నారు. ప్రజావేదిక కూల్చడం వల్ల ప్రజల సొమ్ము వృథా అవుతుందని, మరో వేదిక కట్టే వరకు ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవాలంటే ప్రైవేటు వేదికులకు డబ్బు ఖర్చవుతుందని తెలిపారు.



 


Tags:    

Similar News