ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

Update: 2019-06-04 14:42 GMT

పాలన లో తన మార్క్ చూపించడానికి సిద్ధమైన ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు అవసరమైన చర్యలు వేగంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం ఇప్పడు జిల్లా కలెక్టర్లను భారీగా మార్చింది. ఈ మేరకు జీవో ఈ సాయంత్రం విడుదల చేశారు. 

మారనున్న 9  జిల్లాల కలెక్టర్లు.. 

గుంటూరు జిల్లా కలెక్టరుగా ఐ.శామ్యూల్‌ ఆనందకుమార్‌, ప్రకాశం జిల్లా కలెక్టరుగా పి.భాస్కర్‌, తూర్పుగోదావరి జిల్లా కలెక్టరుగా డి.మురళీధరరెడ్డి, నెల్లూరు జిల్లా కలెక్టరుగా ఎం.వి.శేషగిరిబాబు, అనంతపురం జిల్లా కలెక్టరుగా ఎస్‌.సత్యనారాయణ, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా ఎం.ముత్యాలరాజు, విశాఖ జిల్లా కలెక్టరుగా వి.వినయచంద్‌, కర్నూలు జిల్లా కలెక్టరుగా జి.వీరపాండ్యన్‌, చిత్తూరు జిల్లా కలెక్టరుగా నారాయణ భరత్‌ గుప్తా.లను నియమిస్తూ ఆదేశాలు విడుదల అయ్యాయి. 

36 మంది IAS ల బదిలీలు 

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్, ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం, బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్., పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము, యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్, పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు, స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు, ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా, జెన్కో ఎండీగా బి. శ్రీధర్, ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్, సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్, హోం సెక్రటరీగా కిషోర్ కుమార్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా, అజేయ్ జైన్ జీఏడీకి అటాచ్, విజయానంద్ జీఏడీకి అటాచ్. శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్, మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న, ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్.,సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్, సీఎం ఓఎస్డీగా జే. మురళీ, సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ, ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు, హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్, ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే, మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర, సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం  లను బదిలీల పై నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 

కాగా, కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లకు స్థాన చలనం కలుగలేదు. 

Tags:    

Similar News