వైసీపీలో చేరిన దాసరి తనయుడు

Update: 2019-03-14 11:19 GMT

దివంగత మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు కిరణ్ కుమార్ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయానికి వచ్చిన కిరణ్.. జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాసరి నారాయణరావు బ్రతికి ఉంటే ఖచ్చితంగా వైసీపీలో చేరి ఉండేవారని అన్నారు.

వైసీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చే ఆ పార్టీలో చేరారని అన్నారు. తమ అధినేత వైయస్ జగన్ ఆదేశిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తానని అన్నారు. కాగా ఇటీవల చాలా మంది సినీనటులు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. బుధవారం నటుడు దగ్గుబాటి రాజారవీంద్ర కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 

Similar News