చిత్తూరు రూరల్ మండలం చెర్లోపల్లెలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ ఎగిరిపడింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పేలుడుకు కారణం గ్యాస్ సిలిండరా లేక జిలెటిన్ స్టిక్సా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.