అమరావతి - మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా

Update: 2020-05-04 12:49 GMT
nimmagadda ramesh kumar (file photo)

మాజీ ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ లో విచారణను హైకోర్టు సీజే మహేశ్వరి రేపటికి వాయుదా వేసారు. ఈ పిటిషన్ పై వాదనలు ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రారంభమై సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగాయి. నిమ్మగడ్డ రమేష్ ను తొలగించడం రాజ్యాంగ విరుద్దమని సీనియర్ న్యాయవాదులు బండారుపల్లి ఆదినారాయణ, వేదుల నారాయణ వాదనలు వినిపించారు. ధర్మాసనం ముందు తమ అభ్యంతరాలను తెలిపారు. కాగా రేపటి విచారణంలో మరికొంత మంది పిటిషనర్ల వాదనలను హైకోర్టు ధర్మాసనం విననుంది.




Tags:    

Similar News