ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా అందరం ప్రజా సేవకులం.. అందరమూ ప్రజల బంట్రోతులమే అంటూ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిన్న అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రాజకీయాల్లో నాయకులంతా ప్రజలకు బంత్రోతులే అని ఆయన చెప్పారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియా పాయింట్ వద్ద అయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రజా సమస్యల మీద మాట్లాడలేదని ఆయన పెదవి విరిచారు. ఈ పదిహేను రోజుల వైసీపీ పాలన ఎలా ఉందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మరికొంతకాలం వేచి చూద్దాం అంటూ బదులిచ్చారు.