కొడైకెనాల్‌లో ఖమ్మం యువ జంట ఆత్మహత్య

కొడైకెనాల్‌లో ఖమ్మం యువ జంట ఆత్మహత్య
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

Khammam Couple Suicide In Kodaikanal : కరోనా కారణంగా ప్రయివేటు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎంతో మంది వారి ఉపాధిని కోల్పోయారు.

Khammam Couple Suicide In Kodaikanal : కరోనా కారణంగా ప్రయివేటు, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎంతో మంది వారి ఉపాధిని కోల్పోయారు. అయితే వారిలో కొంత మంది ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటుంటే మరి కొంత మంది మాత్రం బలవంతంగా వారి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువ జంట ఆర్థిక ఇబ్బందులు తాలలేక కొడైకెనాల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజడ్ల గోపీకృష్ణ (25), భద్రాచలం సమీపంలోని చోడవరానికి చెందిన ఏపూరి నందినిని 2018లో హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత వారు ఇద్దరూ ఓ ఐటీ కంపెనీలో విధులు నిర్వహిస్తుతన్నారు. కాగా వారు ఏడాది క్రితమే హైదరాబాద్ నుంచి కొడైకెనాల్‌కి వెళ్లి అక్కడే ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే ఎప్పుడు అందరితో సరదాగా ఉండే వీరు రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అది గమనించిన ఇరుగు పొరుగు వారు వారికి ఫోన్ చేసారు. అయినా వారు స్పందించక పోవడంతో స్థానికులు వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతొ అక్కడికి చేరుకన్న పోలీసులు ఇంటి తలుపులు తెరచి చూడగా వారు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు ఇరుగు పొరుగు వారితో మాట్లాడగా లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరూ ఉద్యోగాలు కోల్పోయారని, అప్పటి నుంచి వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఇల్లు కూడా గడవని పరిస్థితిలో ఉన్నారని సమాచారం.

అయితే ఈ పరిస్థితిలో నందిని ఉద్యోగ ప్రయత్నాలు చేసిందని, స్థానికంగా ఆమెకు ఉద్యోగం రాలేదని సమాచారం. లాక్‌డౌన్ కారణంగా వీరిద్దరూ ఉద్యోగాలు కోల్పోయారని.. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని సమాచారం. నందిని ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పటికీ కుదర్లేదని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లాలని నిర్ణయించుకున్నారని.. నందినికి అక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్లడం కుదరకపోవడంతో.. ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇంటికి తిరిగి రాలేక.. అటు ఆస్ట్రేలియా వెళ్లలేక.. చేతిలో డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురైన వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. తెలుగులో సూసైడ్ నోట్ రాసి వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. డబ్బు లేకపోవడంతో గత కొంత కాలంగా వీరు ఫోన్లు రీఛార్జ్ చేయలేదని.. ఇంట్లో డబ్బులు కూడా లేదని సమాచారం. అయితే అప్పటికే నందినికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చిందని ఇద్దరూ వెళ్లాలని నిర్ణయించుకున్నా ఆర్ధిక ఇబ్బందులతో వెల్లడం కుదరక ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. చేతిలో డబ్బులు లేక తీవ్ర మనోవేదనకు గురైన వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories