సికింద్రాబాద్‌ నేరెడ్‌మెట్‌లో దారుణం.. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

Sexual Harassment of a Minor Girl in Secunderabad
x

సికింద్రాబాద్‌ నేరెడ్‌మెట్‌లో దారుణం.. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు

Highlights

Secunderabad: ఈ నెల 19న ఆశ్రమంలో కనిపించకుండా పోయిన నలుగురు యువతులు

Secunderabad: సికింద్రాబాద్ నేరెడ్‌మెట్‎లో దారుణం జరిగింది. జేజే నగర్‎లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 19న ఆశ్రమంలో నలుగురు యువతులు కనిపించకుండా పోయారు. అందులో ఒకరు మేజర్, మరో ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన నేరెడ్‌మెట్ పోలీసులు వారిని గుర్తించారు. ఇద్దరు సికింద్రాబాద్‎లో, మరో ఇద్దరు బంధువుల ఇంట్లో ఉన్నట్లు నిర్ధారించారు. వారిని సఖీ సెంటర్‎కు తరలించారు. సఖీ సెంటర్‎లో లైంగిక దాడి విషయాన్ని మైనర్‌ బాలిక పోలీసులకు వెల్లడించారు. ఆశ్రమంలో అకౌంటెంట్ మురళి లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక ఆరోపించారు. బాలిక ఫిర్యాదుతో మురళితోపాటు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories