Hyderabad: పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌.. పాల్గొన్న నారా బ్రాహ్మణి

Saree Run in Hyderabad
x

Hyderabad: పీపుల్స్‌ ప్లాజాలో శారీ రన్‌.. పాల్గొన్న నారా బ్రాహ్మణి

Highlights

Hyderabad: జెండా ఊపి శారీ రన్‌ను ప్రారంభించిన నారా బ్రాహ్మణి

Hyderabad: తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కంపెనీ జేజే యాక్టివ్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో శారీ రన్‌ నిర్వహించాయి. పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3 వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చీర సంప్రదాయంతో పాటు స్త్రీలకు గుర్తింపును తీసుకువస్తుందని ఈ సందర్భంగా నారా బ్రహ్మణి అన్నారు. చీరలు మహిళలకు హుందాతనం, గౌరవాన్ని ఇస్తాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories