House Owner Victimization on Tenants: తళ్లీకూతుళ్లపై ఇంటి యాజమాని అఘాయిత్యం

House Owner Victimization on Tenants: తళ్లీకూతుళ్లపై ఇంటి యాజమాని అఘాయిత్యం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

House Owner Victimization on Tenants: నేటి కాలంలో మహిళలు బయటికి వెళితేనే కాదు, ఇంట్లో ఉన్నా కూడా వారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్న పెద్దా అన్న తేడా కూడా లేకుండా పరాయి స్త్రీలపై మృగాళ్లలా విరుచుకుపడుతున్నారు.

House Owner Victimization on Tenants: నేటి కాలంలో మహిళలు బయటికి వెళితేనే కాదు, ఇంట్లో ఉన్నా కూడా వారికి రక్షణ లేకుండా పోతుంది. చిన్న పెద్దా అన్న తేడా కూడా లేకుండా పరాయి స్త్రీలపై మృగాళ్లలా విరుచుకుపడుతున్నారు. పోలీసులు, న్యాయస్థానాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మహిళలు మాత్రం క్షణ క్షణం భయపడుతూనే బతుకీడ్చాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కడో ఓ చోట మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళలు కూడా సాటి మనుషలే అన్న విషయాన్ని కూడా మరచిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. అభం శుభం తెలియని బాలికలపైనా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు.

ఇలాంటి దారుణమైన సంఘటనే హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన కొడుకు, కుమార్తెతో కలిసి ఓ ఇంటిలో అద్దెకు ఉంటోంది. ఆమెపై కన్నేసిన ఆ ఇంటి యజమాని ఎలాగయినా ఆమెను లోబర్చుకోవాలనుకున్నాడు. మహిళ ఆమె పిల్లలు తినే ఆహారంలో మందుమందును కలిపాడు. అది తిన్నవారంతా స్పృహ కోల్పోగానే ఇంటి యాజమాని తన పైశాచికత్వాన్ని చూపించాడు. అతను ఒక్కడే కాకుండా తన స్నేహితులను కూడా పిలిచి తల్లీకూతుళ్ల జీవితాన్ని నాశనం చేసాడు.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో ఓ మహిళ(35) తన కూతురు(15), కొడుకుతో కలిసి ఓ ఇంటిలో అద్దెకు ఉంటోంది. తరచూ ఆ ఇంటికి వచ్చిపోయే ఇంటి యజమాని ఆ మహిళపై కన్నేసాడు. ఏదో ఒక విధంగా ఆ మహిళను లోబర్చుకోవాలనుకున్నాడు. దాని కోసం ఓ ఉపాయం ఆలోచించి మహిళ తినే ఆహారంలో మత్తుమందు కలిపాడు. ఆ విషయం తెలియని వారు మత్తు మందు కలిపిన ఆహారం తినేశారు. ఆ తరువాత కొద్దిసేపటికే వారంతా స్పృహ కోల్పోయారు. అది గమనిస్తూ ఉన్న ఇంటి యాజమాని, అతడి స్నేహితులు అక్కడికి వెళ్లి తళ్లీకూతుల్లపై లైంగిక దాడి చేసారు. అది గమనించిన కొంత మంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అపస్మారక స్థితిలో ఉన్న మహిళను, ఆమె కూతురిని ఉస్మానియా ఆస్పత్రికి, కొడుకును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories