గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Case Booked Against BJP MLA Raja Singh in Hyderabad
x

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Highlights

Case Against Rajasingh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది.

Case Against Rajasingh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాజాసింగ్‌పై వెంటనే FIR నమోదు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళ్‌హాట్ పోలీసులు, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశామని మంగళ్ హాట్ పోలీసులు తెలిపారు. ప్రెస్‌మీట్లు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై సైతం నిషేధం విధించింది ఈసీ. వివిధ రకాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది ఈసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories