RGV Deyyam: కరోనాకు భయపడటం మానేసి మా దెయ్యనికి భయపడతారు

RGV Deyyam Movie On April 16th
x

దెయ్యం ఫైల్ ఫోటో 

Highlights

RGV Deyyam: రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌జీవీ దెయ్యం’.

RGV Deyyam: రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'ఆర్‌జీవీ దెయ్యం'. హీరోయిన్ స్వాతి దీక్షిత్ మరో కీలక పాత్ర పోషించింది. హార్రర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీ మూడేళ్ల కిందటే రిలీజ్ కావాల్సింది. పలు కారణాల వల్ల చిత్రం రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఏట్టకేలకు ఈ దెయ్యం అన్ని అడ్డంకులు దాటుకుని తెలుగుతో పాటు 5 భాషలలో ఏప్రిల్ 16న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి రాంగోపాల్ వర్మ, రాజశేఖర్ ఇంకా పలువురు నటీనటులు హాజరైయ్యారు. రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ .. మా'దెయ్యం సినిమా ఇంతకాలం ఆగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా చెప్పాలంటే నేను జీవిత ఈ సినిమా గురించి అనుకున్నప్పుడు రాజశేఖర్ వేరే సినిమాలో బిజీగా వున్నారు. తిరిగి ఆయన నా దగ్గరకి వచ్చేసరికి నేను ముంబైలో వేరే సినిమాలో బిజీగా వున్నా. ఇద్దరం వేరే వేరే చిత్రాలతో బిజీ ఉన్నందున ఈ సినిమా ఆలస్యమైంది. ఈ చిత్రంలో స్వాతి రాజశేఖర్ కూతురు పాత్రలో అద్భుతంగా నటించింది'అని అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. 'ఇంత కాలానికి మా "దెయ్యం" మూవీ కి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నాను. అందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ మా దెయ్యం సినిమా చూడాలని కోరుతున్నాను' అని అనగా మరో నిర్మాత.. నట్టి కుమార్ మాట్లాడుతూ.. 'దెయ్యం సినిమా కంటెంట్ చాలా బాగుంది. తప్పకుండా హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది. 16 వ తేదీన మా సినిమా సోలోగా వస్తుంది. మీరందరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని కోరుతున్నాను' అని అన్నారు.

హీరోయిన్ స్వాతి మాట్లాడుతూ.. 'నేను ఈ మూవీ కోసం చాలా కాలం నుంచి ఎదురు చూశాను. సినిమా పోస్ట్‌పోన్ కావడం కాస్త నిరాశపరిచినప్పటికీ.. ఇప్పుడు విడుదల అవుతున్నందుకు చాలా అనందంగా ఉంది. ఈ చిత్రం మీ అందరికీ తప్పక నచ్చుతుందని బావిస్తున్నాను. మా సినిమా చూశాక కకరోనాకు భయపడటం మానేసి మా దెయ్యనికి భయపడతారు' అని చెప్పింది.

ఈ మూవీలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ,తనికెళ్ల భరణి, అనితా చౌదరి, జీవ, బెనర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నట్టిస్ ఎంటర్‌టైన్మెంట్స్, పెగాసస్ సినీ కార్ప్ యల్.యల్.పి పతాకాలపై జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories