Chandrababu: వైసీపీ నేతలు ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు

TDP President Chandrababu Fires on YCP Leaders
x

టీడీపీ అధినేత చంద్రబాబు(ఫోటో: ది హన్స్ ఇండియా)

Highlights

* వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు

Chandrababu: వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నామినేషన్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories