భర్తకు తలకొరివిపెట్టిన భార్య...అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసిన కన్నకొడుకు

భర్తకు తలకొరివిపెట్టిన భార్య...అంత్యక్రియలను వీడియో కాల్‌లో చూసిన కన్నకొడుకు
x
Highlights

సిద్ధిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తండ్రిని చివరిసారిగా చూసుకుని తలకొరివి పెట్టే అవకాశాన్ని ఓ కొడుకు లాక్ డౌన్ కారణంగా కోల్పోయాడు.

సిద్ధిపేట జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చనిపోయిన తండ్రిని చివరిసారిగా చూసుకుని తలకొరివి పెట్టే అవకాశాన్ని ఓ కొడుకు లాక్ డౌన్ కారణంగా కోల్పోయాడు.గుజరాత్ వెళ్లి అక్కడ డబ్బులు సంపాధించి కుటుంబాన్ని పోషించడానికి వెల్లి అటే చిక్కుకున్నాడు.

పున్నామ నరకం నుంచి తప్పించాల్సిన కొడుకు రాక పోవడంతో కట్టుకున్న భార్యే అన్నీ అయ్యి తానై తలకొరివి పెట్టింది. కన్న కొడుకు ఈ సంఘటనను వీడియో కాల్ లో చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. అక్కడున్న వారుకూడా కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు.

పూర్తి వివరాల్లోకి వెళితే సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండంలలోని పందిల్ల గ్రామంలో వెల్దండి రాములు, లసుమమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవారు. వారికి ఒక కొడుకు కనకయ్య ఉన్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో కుటుంబం ఉండడంతో కనకయ్య పొట్టకూటికోసం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు వెళ్లాడు.

కొన్ని రోజుల నుంచి కనకయ్య తండ్రి రాములు ఆనారోగ్యంతో ఉంటూ శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. వెంటనే ఈ విషయాన్ని కనకయ్యకు తన బంధువులు తెలపగా లాక్ డౌన్ జరుగుతుండడంతో స్వగ్రామానికి చేరుకోలేక పోయాడు. కొరివి పెట్టడానికి కొడుకు లేక పోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో కట్టుకున్న భార్యే భర్తకి తలకొరివి పెట్టింది. అలా తన తల్లి తండ్రి శవానికి కొరివి పెట్టడాన్ని లైవ్‌లో చూసిన కొడుకు బోరున విలపించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories