మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం.. సారీ చెప్పిన కలెక్టర్

మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం.. సారీ చెప్పిన కలెక్టర్
x
మంత్రి, ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం.. సారీ చెప్పిన కలెక్టర్
Highlights

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా...

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. తనకు తెలియకుండా ఎస్సారెస్పీ రివ్యూ మీటింగ్ పెట్టడంపై శంకర్ నాయక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు మీకు తెలుసా, నాకు తెలుసా అంటూ మంత్రిపై మండిపడ్డారు. రివ్యూ మీటింగ్ అంటే నాలుగు మాటలు మాట్లాడి ఫోటోలు దిగి ముగించడం కాదన్నారు.

సమిష్టిగా పని చేద్దాం, సమస్యలు చెప్పండి అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. మంత్రి మాటల తీరుపై శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మధ్యలో కలెక్టర్ గౌతమ్ జోక్యం చేసుకున్నారు. శంకర్ నాయక్ కు సారీ చెప్పారు కలెక్టర్. కలెక్టర్ స్థాయి వ్యక్తి సారీ చెప్పడం సరికాదన్న శంకర్ నాయక్ హడావిడిగా రివ్యూ మీటింగ్ పెట్టరాదన్నారు. శంకర్ నాయక్ మాటలపై మంత్రి సత్యవతి రాథోడ్ అసహానం వ్యక్తం చేశారు. సమస్యలు మీరు చెప్పండి అంటే, మీరు చెప్పండి అంటూ ఎమ్మెల్యే, మంత్రి వాదులాడుకున్నారు. కలెక్టర్ ఎమ్మెల్యే, మంత్రికి శాంతింపజేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories