కేటీఆర్.. మీ నాన్న అనుమతి తీసుకున్నారా: విజయశాంతి

కేటీఆర్.. మీ నాన్న అనుమతి తీసుకున్నారా: విజయశాంతి
x
Highlights

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు కేటీఆర్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ విషయంపై విజయశాంతి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను కేసీఆర్ సర్కార్ దోచిందన్న నడ్డా వ్యాఖ్యలు అబద్దాలని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కేటీఆర్ విసిరిన సవాల్‌పై ఆమె స్పందించారు. ఇంతకు ఇలాంటి సవాల్ చేసే ముందు మీ తండ్రి సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా అంటూ ఎద్దేవా చేశారు. కాగా ఇటివల ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో కూడా ఇదే కేటీఆర్ ఇలాగే సవాల్ విసిరారని గుర్తు చేశారు.

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యమే కారణమని, ఈ గ్లోబరీనా సంస్థకు టీఆర్ఎస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయని తనతో పాటూ ప్రతిపక్షనేతలు చాలా మంది ఆరోపించినప్పుడు కూడా కేటీఆర్ ఇదే రకంగా సవాల్ విసిరారని, తమపై ఆరోపణలు చేసినవారు దమ్ముంటే ఆధారాలు చూపించాలని అప్పుడు కేటీఆర్ అన్న విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా రాష్ట్రపతి ఆదేశాలతో షాక్ అయినా సీఎం కేసీఆర్ ఆ తప్పిదాన్ని ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. అదంతా ప్రతిపక్షాల కుట్ర అని, అనవసరంగా తమను బద్నాం చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని విమర్శించే ముందు కేటీఆర్ ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్ తెలుసుకుంటే మంచిదని విజయశాంతి వ్యాఖ్యానించారు. కాగా, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సాక్ష్యాధారాలు ఇచ్చినట్లుగానే ఇప్పుడు బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్రానికి కేసీఆర్ అవినీతిపై ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories