ఆయన ఏ కారణాలతో వెళ్తున్నారో నాకు చెప్పారు: ఉత్తమ్

ఆయన ఏ కారణాలతో వెళ్తున్నారో నాకు చెప్పారు: ఉత్తమ్
x
Highlights

పార్టీని వీడుదామని అనుకున్న వాళ్లు ఏదైనా మాట్లాడతారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై...

పార్టీని వీడుదామని అనుకున్న వాళ్లు ఏదైనా మాట్లాడతారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన ఉత్తమ్ రాజకీయ కారణాలతో వెళ్లేవారికి ఎదైనా చొప్పొచ్చని ఆర్థికపరమైన కారణాలతో వెళ్లేవారికి ఏం చెప్పగలమన్నారు. రాజగోపాల్ రెడ్డి ఏ కారణంతో వెళ్తున్నారో తనకు చెప్పారన్నారు. ఏఐసీసీ పెద్దలతో చర్చించిన తర్వాత మరోసారి రాజగోపాల్ రెడ్డితో మాట్లాడతానని ఉత్తమ్ పేర్కొన్నారు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకూ తన ముఖ్య అనుచరులతో సమావేశమై పార్టీ మారాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీ.పీసీసీ తమకు వచ్చే అవకాశం లేదని, బీజేపీలో మంచి అవకాశాలు వస్తాయని అనుచరులతో రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న రాజగోపాల్‌రెడ్డి.. ఇవాళ హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించి బీజేపీలో చేరే విషయాన్ని వెల్లడించనున్నట్టు తెలుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories